సోమవారం, 30 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (13:26 IST)

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యపై అత్యాచారం చేశాడు.. ఆపై నగలు దోచుకున్నాడు..

ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే అత్యాచారం చేసి.. ఆపై ఆమె ధరించిన నగలను దోచుకున్న ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే

ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే అత్యాచారం చేసి.. ఆపై ఆమె ధరించిన నగలను దోచుకున్న ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉపాధి నిమిత్తం నోయిడాకు గత 2013లో వచ్చింది. అక్కడ ఓ వ్యక్తితో పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరు యేడాదిన్నర పాటు సహజీవనం చేశాక.. రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఎపుడు కూడా బయటకు చెప్పుకోలేదు. 
 
ఈ పరిస్థితుల్లో గత కొన్ని నెలలుగా తరచూ గొడవ పడుతూ వచ్చారు. ఈ క్రమంలో గతవారం తన మాటను ఏమాత్రం లెక్క చేయనందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అంతే.. భార్యపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన నగలతో పాటు.. ఇంట్లో ఉన్న ఆభరణాలను తీసుకుని పారిపోయాడు. 
 
దీనిపై పార్థల పోలీసు స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యూడీషియల్ కస్టడీకి పంపించారు.