శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Ganesh
Last Updated : సోమవారం, 23 జూన్ 2014 (09:29 IST)

ఆన్‌లైన్‌లో వ్యభిచారం... పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి!

హైదరాబాద్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్‌పై ఓ వ్యభిచార ముఠా దాడి చేసింది. పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల్ని చితకబాది పారిపోయిందా వ్యభిచార ముఠా. హైదరాబాదులోని రహమత్ నగర్‌లో వ్యభిచారం జరుగుతోందని పక్కా సమాచారంతో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేశారు. ఆ పోలీసుల్ని చితకబాది ఓ యువతి సహా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.

వ్యభిచారం జురుతోందని సమాచారం రావడంతో అడిషనల్‌ డిసిపి గన్‌మేన్‌, జూబ్లీహిల్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కొండారెడ్డి వ్యభిచార గృహంపై దాడి చేయడానికి వెళ్లారు. అయితే వారిపై కొందరు వ్యక్తులు దాడిచేశారు. సుధాకర్ అనే వ్యక్తి కిచెన్‌లో చాకుతో వారిపై దాడిచేసి చెశారు. ఇద్దరు పోలీసులు మఫ్టీలో ఉన్నారని, సరైన బందోబస్తు ఉండిఉంటే, ఈ ఘటన జరిగి ఉండేదికాదని వెస్ట్‌జోన్‌ డిసిసి సత్యన్నారాయణ తెలిపారు. బ్రోకర్‌ జగదీష్‌ను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఐ, సీఐలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కానిస్టేబుళ్లు దాడిచేసినట్లు డిసిపి చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకురాకుండా ఈ దాడులు చేశారని, అత్యుత్సాహంతో చేశారా? లేక వసూళ్ల కోసం చేశారా? అన్నది ఆరా తీస్తున్నట్లు ఆయన వివరించారు.