మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 14 జనవరి 2016 (19:08 IST)

సన్వారియా గ్రూప్‌‌‌తో అమీషా పటేల్‌కు కష్టాలు: రూ. 450కోట్ల బ్లాక్ మనీ?

సన్వారియా గ్రూప్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో బాలీవుడ్ నటి అమిషా పటేల్‌కు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ మేరకు గ్రూప్‌ డైరెక్టర్‌ అనిల్‌ అగర్వాల్‌ను విచారించిన ఆదాయపు పన్ను అధికారులు.. ఆయనకు బాలీవుడ్‌ నటి అమీషాపటేల్‌, దర్శకుడు, నిర్మాత ప్రకాష్‌ఝాతో సంబంధాలున్నట్టు గుర్తించారు. అమీషా పటేల్‌కు చెందిన ప్రొడక్షన్‌ హౌజ్‌తో పాటు, ప్రకాష్‌ఝా సినిమాలకు అనిల్‌ అగర్వాల్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులు సమకూర్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. 
 
సన్వారియా గ్రూపునకు చెందిన 15 కార్యాలయాలపై గత నెలలో దాడులు జరిపిన ఐటి అధికారులు.. అనిల్‌ అగర్వాల్‌ బాలీవుడ్‌లో భారీ పెట్టుబడులు పెట్టినట్టు తేల్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 450 కోట్ల బ్లాక్‌ మనీని ఐటీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి త్వరలోనే అమీషా పటేల్‌తో పాటు, ప్రకా‌ష్‌ఝాను ఐటి అధికారులు ప్రశ్నించనున్నారు.