శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 16 మార్చి 2017 (20:44 IST)

కాంగ్రెస్సా... మజాకా... సిద్దూకి అలా మొండి 'హస్తం' చూపించారా...?

మొన్న ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది. కానీ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోగల సంఖ్యను కూడ్చలేకపోవడంతో భాజపా ఆ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక పంజాబ్ రా

మొన్న ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది. కానీ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోగల సంఖ్యను కూడ్చలేకపోవడంతో భాజపా ఆ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సీట్లు రావడంతో ఆ పని పూర్తి చేసింది. 
 
పంజాబ్ రాష్ట్రానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మరో తొమ్మిది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వారికి కేటాయించిన శాఖలను ప్రకటించారు. ఈరోజు సాయంత్రం ప్రకటించిన శాఖల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూకి 3 శాఖలు కేటాయించారు. స్థానిక పరిపాలన, పర్యాటక, సాంస్కృతిక శాఖల బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఐతే సిద్ధూ తనకు ఉపముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఉపముఖ్యమంత్రి పదవి కాకుండా 3 పదవులిచ్చి మొండి హస్తం చూపిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.