1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (10:53 IST)

అమ్మతనానికే మచ్చ తెచ్చింది.. కుమార్తెను అమ్మేసింది.. తండ్రి ఎవరో?

ఆధునిక యుగం, స్మార్ట్ ఫోన్‌ల యుగంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వావివరుసలు లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కన్నతల్లి తన కుమార్తెను వ్యభిచార రొంపిలోకి దించేసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు చెందిన దంపతులకు ఓ కుమార్తె(15), కుమారుడు ఉన్నారు. 
 
మూడేళ్ల క్రితం మనస్పర్థల కారణంగా భార్య భర్తలిద్దరూ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఆ తండ్రి తన బిడ్దలను పెంచుతానని చెప్పినా భార్య ఒప్పుకోలేదు. తన వద్ద వుంచుకుని కుమార్తెను నానా ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలో తన కూతురును వ్యభిచార గృహానికి అమ్మేసింది.
 
అక్కడ వారు కొంతకాలం వాడుకుని వేరొక ముఠాకు అమ్మగా ప్రస్తుతం ఆ బాలిక ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది. అయితే తండ్రెవరూ కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. ఇక తల్లి ప్రవర్తన నచ్చిని ఆ కుమారుడు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తల్లిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.