1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (17:21 IST)

తమిళనాడులో నైట్ కర్ఫ్యూ లేదు... ఆదివారం లాక్‌డౌన్ లేదు

తమిళనాడులో నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నారు. శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలులో వుండదు. అలాగే కోవిడ్ ఉధృతి కార‌ణఃగా మూతపడిన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటో తేది నుంచి పున‌ః ప్రారంభం కానున్నాయి.
 
అయితే, ఎల్‌కేజీ, యూకేజీ, ప్లేస్కూళ్లను తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వ‌లేదు ప్ర‌భుత్వం. కోవిడ్ కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించింది. కొత్త నిబంధనల ప్రకారం వివాహాలకు వచ్చే అతిథుల సంఖ్య వందమందిగా నిర్ణయించగా, అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమతిస్తారు. 
 
ప్రార్థనా స్థలాలు అన్ని రోజులు తెరిచి ఉంచడానికి అనుమతించబడతాయి. హోటళ్లు, అతిథి గృహాలు 50 శాతం వినియోగదారులకు అనుమతిస్తున్నట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ ఆదివారం (జనవరి 30) పూర్తిగా లాక్‌డౌన్ ఉండదని, దానిని ఉపసంహరించుకుంటున్నట్లు అధికారులు వెల్ల‌డించారు.