శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (15:46 IST)

సోదరిని వేధిస్తున్నాడని.. చేయి నరికి ఎత్తుకెళ్ళిపోయిన అన్నదమ్ములు.. ఎక్కడంటే?

మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వివాహిత అయినప్పటికీ తన సోదరిని తరచూ వేధిస్తున్నాడని ముగ్గురు సోదరులు కలసి ఓ వ్యక్తి చేయిని నరికేసిన ఘటన గోరఖ్‌పూర్‌లోని సింధులీ బింద

మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వివాహిత అయినప్పటికీ తన సోదరిని తరచూ వేధిస్తున్నాడని ముగ్గురు సోదరులు కలసి ఓ వ్యక్తి చేయిని నరికేసిన ఘటన గోరఖ్‌పూర్‌లోని సింధులీ బిందులీ అనే గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే రాజ్‌మన్‌ అనే వ్యక్తి ఓ యువతి కిడ్నాప్ కేసులో జైలుకు వెళ్ళొచ్చాడు. మహిళలపై ఎప్పటికీ ఓ కన్నేసి వుంచి వారిని ఎలాగైనా వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించేవాడు. అలా కుదరకపోతే.. కిడ్నాప్ చేసేవాడు. ఈ క్రమంలో జైలుకెళ్ళి వచ్చినా అతడి బుద్ధి మాత్రం మారనే లేదు. 
 
జైలునుంచి వచ్చాక కూడా పెళ్లి అయిపోయిన ఆ యువతిని ఫోన్‌ ద్వారా వేధిస్తూనే ఉండేవాడు. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న బాధితురాలి ముగ్గురు సోదరులు.. రాజ్‌మన్‌పై పగ తీర్చుకునేందుకు రెడీ అయిపోయారు. 
 
సోమవారం రాజ్‌మన్‌ కాలువగట్టు దగ్గర ఉండగా ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లిన ముగ్గురు అతడిపై దాడి చేశారు. చేయిని నరికేశారు. దాన్ని తమ వద్దే ఉంచుకున్నారు. అతడిని రక్తపు మడుగులో వదిలేసి పరారైనారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.