నాడు సోడా బాటిళ్లు పగిలితే.. నేడు టేబుల్స్ - మైకులు ధ్వంసమయ్యాయి
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారు విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. అయితే, సభకు హాజరైన డీఎంకేతో పాటు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు రహస్
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారు విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. అయితే, సభకు హాజరైన డీఎంకేతో పాటు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు రహస్య ఓటింగ్కు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో ఆగ్రహించిన డీఎంకే సభ్యులు సభలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గతంలో కూడా నెలకొంది.
అంటే 1988 పరిస్థితే తమిళనాడులో రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. నాడు జయలలిత, ఎంజీ రామచంద్రన్ సతీమణి జానకీ రామచంద్రన్ల మధ్య ఇదే పరిస్థితి తలెత్తింది. 29 సంవత్సరాల తర్వాత మళ్లీ బల పరీక్ష జరుగుతోంది. 1988 బల పరీక్ష సమయంలో అసెంబ్లీలో సోడా బాటిళ్లతో కొడితే అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. అలాగే నేడు టేబుళ్లు, కుర్చీలు విరిగాయి.
నాడు 99 మంది ఎమ్మెల్యేలు జానకీ రామచంద్రన్ తరుపున ఉంటే.. 35 మంది జయలలిత వైపు ఉన్నారు. నాడు కూడా రిసార్ట్ రాజకీయాలు జరిగాయి. ఇరు వర్గాల ఎమ్మెల్యేలను ఎవరికి వారు స్టార్ హోటళ్లలో ఉంచారు. కానీ నేడు పన్నీర్ సెల్వం అలాంటి రాజకీయాలేమీ చేయలేదు.
ఇదొక్కటి తప్ప మిగిలవన్నీ దాదాపుగా ఒకేలా జరుగుతున్నాయి.1988లో జానకీ రామచంద్రన్ గెలుపొందారు. మరి ఇప్పుడు ఎవరు నెగ్గుతారో చూడాలి.