శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 11 జనవరి 2021 (22:22 IST)

కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదం, భార్య దుర్మరణం

కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రి తృటిలో బయటపడ్డారు. కానీ ఆయన సతీమణి, వ్యక్తిగత కార్యదర్శి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు.
 
మంత్రి శ్రీపాద్ నాయక్ క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. తీవ్ర గాయాలైన మంత్రి శ్రీపాద్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.