గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (13:09 IST)

అంటరాని ప్రేమ : దళితుడిని పెళ్లి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెపై లాయర్ల దాడి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొత్త దంపతులపై ఆ రాష్ట్ర న్యాయవాదులు దాడిచేశారు. దళిత యువకుడుని పెళ్లి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెపై లాయర్లు దాడి చేశారు. ఈ మేరకు బాధితులు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కుమార్తె సాక్షి మిశ్రా ఓ దళిత యువకుడిని వివాహం చేసుకుంది.
 
ప్రేమ వివాహం చేసుకున్న సాక్షి మిశ్రా, ఆమె భర్త అజితేశ్ కుమార్ తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం ఉదయం అలహాబాద్ హైకోర్టులో హాజరయ్యారు. కోర్టు విచారణ పూర్తయి, బయటకు వస్తున్న ఈ జంటపై కొందరు న్యాయవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే ఆ దాడుల నుంచి ఈ దంపతులను అక్కడే ఉన్న మరికొందరు లాయర్లు కాపాడారు. 
 
సాక్షి మిశ్రా, అజితేశ్ కుమార్‌కు రక్షణ కల్పించాలని జస్టిస్ సిద్దార్థ వర్మ ఆదేశించిన కొద్దిసేపట్లోనే ఈ దాడి జరుగడం గమనార్హం. జరిగిన ఘటనపై సాక్షి దంపతులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, వాళ్లపై దాడి జరిగినట్టు మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని కంటోన్మెంట్ పోలీసు అధికారి ఏ కే గౌతమ్ తెలిపారు.
 
ఈ వ్యవహారంలో కిడ్నాప్‌కి గురైన వాళ్లు సాక్షి, అజితేశ్ అన్న వదంతులు వ్యాపించాయని చెప్పారు. పెళ్లి చేసుకున్న అనంతరం తన తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ సాక్షి మిశ్రా ఇటీవల ఓ వీడియోలో పేర్కొన్న విషయం తెలిసిందే.