శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 జనవరి 2022 (09:39 IST)

యూపీలో దారుణం : బీజేపీ అభ్యర్థి - మంత్రి సహచరుడు కాల్చివేత

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఆ రాష్ట్ర మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరికి అత్యంత సన్నితుడు రాంవీర్ సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈయన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఛాటా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని దుండగులు ముగ్గురు కాల్చి చంపారు. మథురలో పోలింగ్‌ జరగడానికి ముందు జరిగిన తొలి హింస కేసుగా ఇది నమోదైంది. 
 
కోసి కలాన్ ప్రాంతంలోని కోకిలావన్‌లోని శని దేవ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ప్రచారం చేయడానికి పైగావ్ గ్రామ అధిపతి కూడా అయిన బీజేపీ కార్యకర్తలతో కలిసి శనివారం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆయన ప్రచారంలో నిమగ్నమైవుండగా, ఇద్దరు వ్యక్తులు అతనిని అనుసరిస్తూ ముందుకు సాగారు. మూడో వ్యక్తి బైక్‌పై వారి కోసం వేచి ఉన్నాడు. దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. కనీసం నాలుగు బుల్లెట్లు తలకు తగలడంతో సింగ్ అకస్మాత్తుగా కిందపడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
 
ఆందోళనకు గురైన స్థానికులు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు రెండు గంటల పాటు ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి హామీ ఇచ్చే వరకు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులకు అప్పగించేందుకు నిరసనకారులు సిద్ధంగా లేరు.
 
చౌదరి జిల్లా మేజిస్ట్రేట్, ఎస్ఎస్ఎపీ అనుమానితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని మరియు సింగ్ కుటుంబానికి వెంటనే పోలీసు భద్రత కల్పించాలని కోరారు. "కేసును సకాలంలో పరిష్కరించకపోతే, నేను ఎన్నికలను వదిలి మథుర రోడ్లపై నిరసన చేస్తాను," అని స్థానికులు ప్రకటించారు. 
 
దిపై మంత్రి మాట్లాడుతూ, "నేను అతనికి రుణపడి ఉంటాను. తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తాను. సింగ్ నా బిడ్డ లాంటివాడు. అతను గత కొన్నేళ్లుగా నాకు ఎన్నికల ప్రతిపాదకుడు. ఇది నిజానికి నాపై దాడి." కేసును ఛేదించి నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఎస్పీ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.