శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (16:26 IST)

కదులుతున్న రైలు నుంచి దిగింది.. అయితే ప్రాణాలతో?

కదులుతున్న రైలులో ఎక్కడం, దిగడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కానీ ఇలాంటి ఘటనలు ఎన్నే విషాదాన్ని మిగిల్చాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ కదులుతున్న రైలు నుంచి దిగుతూ, కిందపడినా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కదులుతున్న రైలు నుంచి వ్యతిరేక దిశలో ఆమె దిగేందుకు ప్రయత్నించింది. 
 
అనుకోకుండా ఆమె రైలు, ఫ్లాట్‌ ఫామ్‌కు మధ్యలో ఇరుక్కొని రైలుకిందకి జారిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమెకు ఏమై ఉంటుందోనని ఆందోళన చెందారు. 
 
అయితే రైలు వెళ్లిపోయిన అనంతరం స్వల్పగాయాలతో పట్టాలపైనుంచి ప్లాట్‌ఫాంపైకి చేరడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.