ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (23:19 IST)

గర్భస్రావం.. ప్రాణాపాయ స్థితిలో మహిళ.. నకిలీ వైద్యుడి అరెస్ట్

woman
తమిళనాడులో ఓ మహిళ గర్భస్రావం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అబార్షన్ మాత్ర వేసుకున్న మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా నకిలీ వైద్యుడు పట్టుబడ్డాడు.
 
వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా అబార్షన్ మాత్రలను విక్రయించరాదని ఇప్పటికే ఫార్మసీలను ఆదేశించింది. ఈ సందర్భంలో, కడలూరు సమీపంలోని ఫార్మసీలో అబార్షన్ మాత్రలు కొనుగోలు చేసి ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరింది.
 
ఈ స్థితిలో అబార్షన్‌ పిల్‌ వేసుకోవాలని సూచించిన అదే ప్రాంతానికి చెందిన సురేష్‌ అనే నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.