మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (13:31 IST)

తరగతి గదిలో దుస్తులు చించి... విద్యార్థుల ముందు.. టీచర్‌కు లైంగిక వేధింపులు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు ఘోరాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏదో ఒక నేరంతో ఈ రాష్ట్రం వార్తల్లోకెక్కుతోంది. తాజాగా ఓ ఉపాధ్యాయురాలిని తరగతి గదిలోనే విద్యార్థుల ముందు నలుగురు క

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు ఘోరాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏదో ఒక నేరంతో ఈ రాష్ట్రం వార్తల్లోకెక్కుతోంది. తాజాగా ఓ ఉపాధ్యాయురాలిని తరగతి గదిలోనే విద్యార్థుల ముందు నలుగురు కామాంధులు లైంగికంగా వేధించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఆగ్రాలోని కస్‌గంజ్ ప్రైమరీ స్కూల్లో ఓ యువతి టీచర్‌గా పని చేస్తోంది. అదే స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న జితేందర్ కన్నుపడింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆ యువతిని జితేందర్ వేధిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ రోజున ఆ యువతిని జితేందర్ అడ్డుకోగా, ఆమె చేయి చేసుకుంది. దీంతో పగ పెంచుకున్న జితేందర్ ఆమెపై కసి తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ నేపథ్యంలోనే శనివారం స్కూల్లో క్లాస్ రూమ్‌లో పాఠాలు చెబుతున్న యువతిని అక్కడే దుస్తులు చించి అమానుషంగా ప్రవర్తించాడు. జితేందర్‌తో పాటు వెళ్లిన మరో నలుగురు కూడా ఆమెను విద్యార్థులందరి ముందూ క్లాస్‌రూమ్‌లో వేధింపులకు గురిచేశారు. వారి నుంచి తప్పించుకున్న ఆ యువతి స్టాఫ్ రూమ్‌ వైపుగా పరుగులు తీయగా, దీంతో జితేందర్, అతని వెంట వచ్చిన వారంతా పరారయ్యాడు. దీనిపై ఆ యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.