జ్యోతి మల్హోత్రాకు జ్యూడిషియల్ కస్టడీ పొడగింపు...
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ హిసార్ స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది. గత గురువారం ఆమె పోలీస్ కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, జ్యోతి మల్హోత్రా మొదట ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఆ తర్వాత గడువు ముగిసిన అనంతరం, విచారణాధికారులు చేసిన అభ్యర్థన మేరకు కోర్టు మరో నాలుగు పోలీస్ కస్టడీని పొడగించింది.
ఈ పొడగించిన రిమాండ్ కూడా గత గురువారంతో పూర్తికావడంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు ఆలకించిన ఆ తర్వాత న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. పాకిస్థాన్ కోసం గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇప్పటివరకు పది మందికిపైగా అరెస్టు చేసిన విషయం తెల్సిందే.