మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2017 (18:35 IST)

నాట్స్‌కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది : పురంధేశ్వరి

అమెరికా తెలుగు సంబరాలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. (జూన్ 30 నుండి జులై 2 వరకు) ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఆహ్వానాల ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురం

అమెరికా తెలుగు సంబరాలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. (జూన్ 30 నుండి జులై 2 వరకు) ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్  తెలుగు రాష్ట్రాల్లో ఆహ్వానాల ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసిన నాట్స్ బృందం సంబరాలకు రావాలంటూ ఆహ్వానాన్ని అందించింది. పురంధేశ్వరితో పాటు ఆమె భర్త.. సీనియర్ రాజకీయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా సంబరాలకు ఆహ్వానించింది. 
 
నాట్స్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి గుర్తు చేసుకున్నారు. నాట్స్ చేసే సేవా కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఆ తర్వాత టీవీ 5 ఛైర్మన్ బీఆర్. నాయుడుతో పాటు, టీవీ 5 సీఈఓ కృష్ణారెడ్డిని సంబరాలకు రావాలంటూ ఆహ్వానం అందించింది. నాట్స్ ఆహ్వానాలను అందించిన వారిలో నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ రవి అచంట తదితరులు ఉన్నారు.