సంబంధిత వార్తలు
- varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?
- Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?
- Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?
- శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?
- శ్రావణమాసంలో ఎవరిని పూజించాలి.. ఏం తీసుకోవచ్చు.. ఏం తీసుకోకూడదు?
జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్
Skandha Sasti
స్కంధ షష్ఠి రోజున కార్తీకేయుడిని నిష్ఠగా పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు నెలకొంటాయి. స్కంధ షష్ఠి జూలై 30వ తేదీన వస్తోంది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయని నమ్మకం ఉంది. సంతానం కోసం ఈ రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన అనుగ్రహం కోరిక తీరుతుందని నమ్మకం.
ఆ రోజున శుచిగా స్నానమాచరించి.. కుమార స్వామిని పూజించాలి. ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి స్వామికి యధాశక్తి అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవాలి. ఈ రోజు స్వామికి ఎర్రని పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయి.
ఆలయాలలో రావిచెట్టు కింద ఉండే నాగప్రతిష్టకు ఈ రోజు సుబ్రహ్మణ్యుని భక్తులు విశేషంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్లు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.
పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం, భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడితో పాటు ఆదిదంపతులైన శివపార్వతులను కూడా పూజించే సంప్రదాయం ఉంది.
