మంగళవారం, 2 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (20:51 IST)

శ్రీశైలం క్షేత్రాన్ని భాద్రపద మాసంలో దర్శించుకుంటే? (video)

భక్తులపాలిట కొంగు బంగారమై శ్రీశైలముపై భ్రమరాంబా సమేతుడై కొలువైవున్నాడు మల్లికార్జునస్వామి. ఎంతో పరమపవిత్రమైన ఈ క్షేత్రం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో భ్రమరాంబికా అమ్మవారి పీఠం ఒకటి. ఇక్కడ స్వామి వారు స్వయంభువుగా వెలిశారు.

ఈ క్షేత్రాన్ని దక్షిణకాశీ అని పిలుస్తారు. ఈక్షేత్రాన్ని ఒకసారి దర్శించిన ఎంతో ముక్తికలుగుతుందని, పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. అలాంటి ఈక్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఎలాంటి ఫలం వస్తుందో శ్రీ పర్వత పురాణం ప్రకారం ఒకసారి తెలుసుకుందాం. 
 
చైత్ర మాసం : చైత్రమాసంలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శిస్తే భక్తులకు సకల సుఖాలు,
వైశాఖ మాసం : కష్టనాశనం, లక్ష గోవుల ధానఫలం కలుగుతుంది.
జేష్ట మాసం : కోరిన కోర్కెలు ఫలిస్తాయి. సువర్ణదాన ఫలం లభిస్తుంది.
 
ఆషాఢమాసం : కోటి గోవులను శివునికి దానం ఇచ్చిన ఫలం
శ్రావణ మాసం : యోజనమంత పొలమును పండితునికి దానం ఇచ్చిన ఫలం
భాద్రపద మాసం : పండితులకు పాడి ఆవులను ఇచ్చి సేవించిన ఫలం
 
ఆశ్వీయుజ మాసం : సకల పాపములు నశించి, అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయి.
కార్తీక మాసం : యజ్ఞములలో అతి గొప్పదైన వాజపేయ యాగం చేసిన ఫలం
మార్గశిర మాసం : చేసిన పాపములు తొలగి, వెయ్యి యాగాలు చేసిన ఫలం
 
పుష్య మాసం : పాతకముల నుండి ముక్తి కలిగి, అతిరాత్రి యజ్ఞం చేసిన ఫలం
మాఘ మాసం : ఆయుస్సు కలిగి, రాజసూయ యాగం చేసిన ఫలం
పాల్గుణ మాసం : జన్మ జన్మలకు తరగని సంపద, పుణ్యము కలుగును అని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.