గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (11:45 IST)

కార్తీక మాసంలో ఇలా చేస్తే..?

కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివుని ఆరాధించిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. ఈ కార్తీక మాసం పూర్తిగా ఈశ్వరుని పూజించడం శుభదాయకమని చెప్తున్నారు. 
 
చాలామంది శివుభక్తులు పరమేశ్వరుని తులసి మాలలతో ఆరాధిస్తుంటారు. ఈ మాసంలో తులసి కోటను పూజిస్తే పరమేశ్వరుని పూజించినట్టవుతుందని నమ్మకం. కనుక ఇంట్లో తులసి కోట లేని వారు వెంటనే కోటను అమర్చుకుంటే మంచిది. ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానమాచరించి కొత్త దుస్తులు ధరించాలి. ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసుకుని ఈశ్వరుని అలంకరించి వారికి నచ్చిన పిండి వంటలను నైవేద్యాలుగా సమర్పించి.. శివనామాన్ని జపిస్తూ పూజలు చేస్తే.. అష్టైశ్వర్యాలు వెల్లువిరుస్తాయని పండితులు చెప్తున్నారు. 
 
అలానే కార్తీక మాసంలో వచ్చే అష్టమినాడు కొబ్బరి కాయను పూజకు ఉపయోగించకూడదు. అంతేకాకుండా ఈ మాసమంతా కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజూకో అధ్యాయం పారాయణం చేస్తే సకలసౌభాగ్యాలు చేకూరుతాయి. శనిగ్రహదోషాలతో బాధపడేవారు ఈ కార్తీక మాసమంతా పరమేశ్వరునికి పూజలు చేస్తే దోషాలు తొలగిపోతాయి.