సంబంధిత వార్తలు
దీపావళి రోజున కేదార గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే..?
kedara gowri vratham
ఒకరోజు దేవ కన్యలు కేదారగౌరీ వ్రతం చేస్తూ నదీతీరానికి వెళుతున్నారు. ఆ వ్రతం, ఉపవాసం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రత మహిళ కారణంగా పుణ్యవతి, భాగ్యవతి సంపన్నులైనారు. వారి తండ్రి పోగొట్టుకున్న రాజ్యాన్ని వారసత్వంగా పొందారు.
ఇద్దరికీ మంచి భర్తలు లభించారు. ఇంతటి సంపత్తు లభించేందుకు కారణమైన ఉమాదేవి ఆరాధనతో కూడిన కేధార గౌరీ వ్రతం పాటించారు. ఆపై వ్రతాన్ని పాటించకుండా వదిలేసింది భాగ్యవతి. ఆపై తప్పు తెలుసుకుని ఈ వ్రతాన్ని తిరిగి ఆచరించింది. ఆపై సంపదలను పొందింది.
కేదారమనగా వరిమడి, పాదు, శివక్షేత్రమని పేరు. ఈశ్వరుడనగా ప్రభువు. పరమాత్మ అని అర్థము. కేదారేశ్వరుడనగా శివుడు. వేద ప్రతిపాదితమైన రుద్రుడే శివుడు. మహాదేవుడు. పశుపతి. కేదారేశ్వర వ్రతం భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకునే వ్రతం.
గతంలో దీపావళి పండుగనాడు చేసుకునేవారు. ఇటీవల కార్తీకమాసంలో నిర్వహించుకుంటున్నారు. ఈ వ్రతానికి ముందుగా 21 పేటల పట్టుదారాన్ని కాని, నూలుదారాన్ని కాని తోరంగా కట్టుకోవాలి. పూజలో గోధుమ పిండితో చేసిన అరిసెలను పాలు, పెరుగు, నెయ్యి, పాయసాలతో పాటు 21 రకాల ఫలాలను, కూరలను నైవేద్యంగా సమర్పించాలి. తేనె తప్పనిసరిగా ఉండాలి.
ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఏకధాటిగా ఇరువది ఒక్క సంవత్సరాల పాటు నిర్వహించి, 21వ సంవత్సరములో పూజాంతములో ఉద్యాపనం చేసుకోవాలి. నైవేద్యం చేయాలి. ఇలా చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
