సంబంధిత వార్తలు
- తెలుగు రాష్ట్రాల ప్రజలకు షాకిచ్చిన దక్షిణ మధ్య రైల్వే.. ఏంటది?
- ఏపీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నీలం సాహ్ని
- ఏపీలో కరోనా కేసులు : గుంటూరులో 176 - విశాఖలో 170
- కర్నూలు : ఆర్టీసీ బస్సులో 14.8 కేజీల బంగారం స్వాధీనం
- ఆంధ్రప్రదేశ్లో ఇసుక దుమారం: కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ చుట్టూ వివాదాలు ఏంటి? క్విడ్ ప్రో కో ఆరోపణలు ఎందుకు?
ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు : తితిదే
తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, వచ్చే నెల 14వ తేదీ నుంచి ఈ సేవలను తిరిగి ప్రారంభించాలని తితిదే నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఏప్రిల్ 14వ తేదీ నుంచి జరిగే ఆర్జిత సేవలకు భక్తులను కూడా అనుమతిస్తారు. ఈ మేరకు తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆర్జిత సేవలు/ఉత్సవాల్లో పాల్గొనే గృహస్తులు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. గృహస్తులు సేవకు మూడు రోజులు ముందు పరీక్ష చేయించుకుని కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేసింది.
2020 మార్చి 20 నుండి 2021 ఏప్రిల్ 13వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, సహస్రకళశాభిషేకం, తిరుప్పావడ, మేల్చాట్ వస్త్రం, పూరాభిషేకం, పునుగు పాత్ర, కస్తూరి పాత్ర, నిజపాదదర్శనం ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు వీటికి బదులుగా బ్రేక్ దర్శనం లేదా సదరు టికెట్ మొత్తాన్ని రీఫండ్ పొందే సదుపాయాన్ని టిటిడి కల్పించింది.
