1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. devotees crowd in tirumala

కలియుగ వైకుంఠం తిరుమల ఖాళీ.. 2 గంటల్లో దర్శన భాగ్యం

devotees
కలియుగ వైకుంఠం తిరుమల ఖాళీగా కనిపిస్తోంది. నాలుగు రోజుల పాటు భక్తులతో పోటెత్తిన తిరుమల ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది. క్యూలైన్లన్నీ భక్తులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. సర్వదర్శనంకు వెళ్ళే భక్తులకు 2 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. కాలినడకన వెళ్ళే భక్తులకు గంటలోగా దర్శన భాగ్యం లభిస్తోంది. 
 
కాగా, సోమవారం రాత్రి వరకు శ్రీవారిని 60,905మంది భక్తులు దర్శించుకోగా సోమవారం ఉదయం 5గంటల నుంచి సర్వదర్శనం కోసం మూడు  కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే కాలినడక భక్తులు ఒక కంపార్టుమెంటులో మాత్రమే వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.51 కోట్లుగా వసూలైంది. 
About Writer
ttdj