1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Swami Swaroopanand comments on Amaravathi muhurtham

అమరావతి ముహూర్తం సరిగ్గా లేకపోవడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయ్!

Swami Swaroopanand
విశాఖపట్నం శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మళ్లీ మళ్లీ షాకింగ్ కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం సరికాదని స్వరూపానందేంద్ర మరోసారి స్పష్టం చేశారు. ముహూర్తం బాగోలేదని.. అందుకే ఆ వేడుకకు హాజరైన వారందరూ కష్టాల్లో పడ్డారని తెలిపారు.

ఈ క్రమంలో అమరావతి శంకుస్థాపనకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశారని, బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకత మొదలైందని  చెప్పారు. 
 
కేసీఆర్‌‌పై సీబీఐ కేసు కూడా బయటికి వచ్చిందని.. ఇవన్నీ అమరావతి ముహూర్తం సరిగ్గా లేకపోవడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని.. తెలిపారు. ముహూర్తం సమయాన్ని పండితుల సూచనల మేరకు నిర్ణయించివుంటే ఈ కష్టాలు వచ్చివుండే కాదని స్వరూపానందేంద్ర చెప్పుకొచ్చారు.  
About Writer
Selvi