1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. tirumala crowd normal

తిరుమల ఖాళీ - కనిపించని భక్తులు

tirumala crowd normal
సర్వాంతర్యామి వెంకన్న కొలువై ఉన్న తిరుమల ఖాళీగా కనిపిస్తోంది. శని, ఆదివారాలు రద్దీగా కనిపించని తిరుమల సోమవారం వచ్చేసరికి బోసిపోయింది. ప్రస్తుతం తిరుమల రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. శని, ఆదివారంలో గదులు, తలనీలాల కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరితే ప్రస్తుతం క్యూలైన్లన్లీ ఖాళీగా కనిపిస్తున్నాయి. 
 
ఆదివారం శ్రీవారిని 78,143 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.67 కోట్ల రూపాయలు వచ్చింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి గంటన్నరలోపే స్వామివారి దర్శనభాగ్యం దక్కింది. అలాగే కాలినడక భక్తులు కూడా మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కూడా అదేసమయం పడుతోంది. 
About Writer
ttdj