తిరుమల సమాచారం... తగ్గుతున్న భక్తుల రద్దీ
రెండు రోజుల పాటు సెలవుదినాలు కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శని, ఆదివారాలు సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. నిన్న శ్రీవారిని 84,507 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడకన వస్తున్న భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.33 లక్షలు. సాయంత్రానికి రద్దీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
