తిరుమల శ్రీవారి పుష్కరిణిలో సంప్రోక్షణం
తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తితిదే ఆలయ వేదపండితులు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం గుర్తుతెలియని భక్తుడు పుష్కరిణిలో పడి మృతి చెందాడు. దీంతో తితిదే సంప్రోక్షణంను నిర్వహించింది. పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించి పరిశుభ్రమైన నీటిని పుష్కరిణిలోకి నింపారు.
సంప్రోక్షణం నిర్వహించడం ద్వారా యథావిథిగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అయితే ఆదివారం రాత్రి వరకు ఎవరినీ పుష్కరిణిలోకి పుణ్యస్నానాలకు అనుమతించరాదని తితిదే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
