శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (14:11 IST)

తితిదే కొత్త పాలక మండలి సభ్యులు వీరే... వెంకయ్య బంధువుకు చోటు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ధర్మకర్తల మండలికి కొత్త సభ్యుల నియామకం జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఓ జీవోను జారీచేసింది. ఇందులో 28 మందితో పాలక మండలిని ఏర్పాటు చేసింది. వీరిలో 24 మంది పాలక మండలిసభ్యులుగా, నలుగు ఎక్స్‌‌అఫిషీయో సభ్యులుగా ఉంటారని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త సభ్యుల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమీప బంధువు డాక్టర్ నిశ్చిత ముప్పవరపుకు కూడా చోటు కల్పించారు. కాగా, కొత్త పాలక మండలిలో చోటు దక్కించుకున్న వారి పేర్ల వివరాలు... 
 
1. కె.పార్థసారథి (ఎమ్మెల్యే)
2. యూవీ రమణమూర్తిరాజు (ఎమ్మెల్యే)
3. ఎం.మల్లికార్జునరెడ్డి (ఎమ్మెల్యే)
4.3పరిగెల మురళీకృష్ణ
5.3కృష్ణమూర్తి వైద్యనాథన్‌
6.3నారాయణస్వామి శ్రీనివాసన్‌
7. జె.రామేశ్వరరావు
8. వి.ప్రశాంతి
9. బి.పార్థసారథిరెడ్డి
10. డాక్టర్‌ నిచిత ముప్పవరపు
11. నాదెండ్ల సుబ్బారావు
12. డీ.పీ.అనంత
13.రాజేష్‌ శర్మ
14. రమేష్‌ శెట్టి
15. గుండవరం వెంకట భాస్కరరావు
16. మూరంశెట్టి రాములు
17. డి.దామోదర్‌రావు
18. చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌
19. ఎంఎస్‌ శివశంకరన్‌
20. సంపత్‌ రవి నారాయణ
21. సుధా నారాయణమూర్తి
22. కుమారగురు (ఎమ్మెల్యే)
23. పుట్టా ప్రతాప్‌రెడ్డి
24. కె.శివకుమార్‌
 
ఎక్స్‌‌అఫీషియో సభ్యులు :
1. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎండోమెంట్‌)
2. దేవాదాయ శాఖ కమిషనర్‌
3. తుడా ఛైర్మన్‌
4. టీటీడీ ఈవో