శుక్రవారం, 27 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (18:57 IST)

నల్గొండలో దారుణం.. కుమారుడు రేప్ చేసి.. హత్య చేస్తే.. తల్లి కాపలా కాసింది..

Rape
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతిని బావబామ్మర్దుల అత్యాచారంచేసి హత్య చేశారు. అక్కడ అనుమానం రాకుండా.. నిందితుడు కన్న తల్లి అక్కడ కాపాలాగా ఉండటం సంచలనంగా మారింది. పుట్టలగడ్డతండాకు చెందిన రూపావత్‌ నాగు నాయక్‌ (22)కు.. మరో యువతికి పరిచయం ఏర్పడింది. 
 
సదరు యువతి హైదరబాద్‌లో కాలేజీ వెళ్తుండగా.. యువతికి మాయమాటలు చెప్పి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత పెళ్లి అనగానే ముఖం చాటేశాడు. యువతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కింద కేసు నమోదు చేశారు. 
 
మళ్లీ జైలు నుంచి రిలీజై మళ్లీ పెళ్లి మాటెత్తాడు. దీంతో గర్భాస్రావం చేయించాడు. ఈ నెల 14న పుట్టలగడ్డతండాలోని నాగు ఇంటికి వెళ్లింది. అక్కడ నాగు తల్లి దారుణంగా ప్రవర్తించింది. నాగు.. తన బావ క్రాంతికుమార్‌ను రప్పించి యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. కుమారుడిని జైలుకు పంపించిందనే కోపంతో నాగు హత్య చేస్తుండగా కాపలా నిలిచింది. ఈ ఘటనపై కేసు నమోదైంది. దర్యాప్తు జరుగుతోంది.