ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (10:51 IST)

తార్నాకలో డ్రగ్స్ కలకలం.. 11 మంది అరెస్టు

drugs
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌ పబ్ ఫుడింగ్ అండ్ మింక్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు ఇటీవల జరిగిన సోదాల్లో డ్రగ్స్‌తో పాటు ఇతర మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ హోటల్ లైసెన్సును రద్దు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు మత్తుపదార్థాలను విక్రయించే వారిని గుర్తించే పనిలో నిమగ్నమైవున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే లక్ష్మీపతి అనే డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేశారు. 
 
తాజాగా తార్నాకలో ఉస్మానియా పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కాటిక్స్ బ్యూరో విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో 11 మంది డ్రగ్స్ విక్రేతలను అరెస్టు చేసింది. వారి నుంచి గంజాయితో పాటు.. హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తి కట్టడి చేసేందుకు పోలీసులు కంకణం కంకణం కట్టుకున్నారు.