1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. five people died in medaram jatara route road accident

తెలంగాణలో ఘోర ప్రమాదం : ఐదుగురు మృతి

five
తెలంగాణలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్తుండగా.. గట్టమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హ‌నుమ‌కొండ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు మేడారం నుంచి తిరుగు ప్రయాణ‌మైన స‌మ‌యంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై నుంచి కారును పక్కకు తొలగించి.. అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఈ ప్రమాదంతో గట్టమ్మ ఆలయ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసుల ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన మేడారం జాతర నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
గూగుల్ తప్పులను పట్టినందుకు రూ. 66 కోట్లు ఆర్జించాడు, ఇక్కడే?