సంబంధిత వార్తలు
- చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో...
- నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి
- 70 మందికి కరోనా వేరియంట్: 10 లక్షల మందికి లాక్డౌన్ విధించిన ప్రభుత్వం, ఎక్కడ?
- రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స : ఏపీ సీఎం జగన్
- పెరూలో ఘోర ప్రమాదం : బస్సు లోయలోపడి 20 మంది మృతి
తెలంగాణలో ఘోర ప్రమాదం : ఐదుగురు మృతి
తెలంగాణలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్తుండగా.. గట్టమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మేడారం నుంచి తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై నుంచి కారును పక్కకు తొలగించి.. అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంతో గట్టమ్మ ఆలయ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసుల ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన మేడారం జాతర నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే.