1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Four died in Chittoor road accident

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో...

Four
చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
చంద్రగిరి మండలం ఐతేపల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
థానేలో బర్డ్‌ఫ్లూ - 25 వేల కోళ్లు చంపేయాలని ఆదేశం