1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జులై 2022 (14:20 IST)

1000 మందిని మోసం చేశాడు.. రూ.40-50కోట్ల వరకు స్వాహా?

Fraud
సోషల్ మీడియా ద్వారా నేరాల సంఖ్య పెరిగిపోతుంది. యువతులు, మహిళలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణ బాగోతాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు అతడు 60 మందిని మోసం చేసి రూ.6 కోట్ల వరకు దోచుకున్నారు. 
 
పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డారు. వంశీకృష్ణ సుమారు 1000 - 1500 మందిని యువతులు, మహిళలను మోసగించి రూ.40-50 కోట్ల వరకు దోచుకున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. అతడిపై అనేక ఫిర్యాదులు రావడంతో గత మే నెలలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పట్టుకున్నారు. తాజాగా హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రామచంద్రరావుపేటకు చెందిన జోగాడ వంశీ కృష్ణ(31) బీటెక్‌ చేశాడు. హోటల్‌లో కొంతకాలం పనిచేశాడు. అతడికి హర్ష, హర్షవర్ధన్‌, చెరుకూరి హర్ష అనే మారుపేర్లు కూడా ఉన్నాయి.
 
2015లో క్రికెట్‌ పందేలకు అలవాటుపడ్డ వంశీకృష్ణ.. 2016లో జాబ్‌ కన్సల్టెన్సీ ఆఫీసులో చేరాడు. ఉద్యోగాలిప్పిస్తానంటూ 10 మంది యువకులకు మోసగించిన కేసులో అరెస్టయి జైలుకెళ్లాడు. బయటికి వచ్చాక 94 పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు.
 
మహిళలు, యువతులకు తనను తాను యువతిగా పరిచయం చేసుకునేవాడు. ఆరేళ్ల వ్యవధిలో వంశీకృష్ణ 1000-1500 మంది మహిళలను మోసం చేశాడని విచారణ అధికారులు చెబుతున్నారు. 
 
వంశీకృష్ణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడి బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.4కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. రిమాండ్‌లో ఉన్న అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం బయటపడుతుందని యోచిస్తున్నారు.