1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2018 (11:13 IST)

శ్మశానంలో మద్యం సేవిస్తూ దొరికిన హైదరాబాద్ కార్పొరేటర్ కుమారుడు

హైదరాబాద్‌ నగర యువత ఏమాత్రం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా, అధికార పార్టీలకు చెందిన తనయులు మరింతగా రెచ్చిపోతున్నారు. తమ తండ్రులు, తల్లుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోతున్నారు.

హైదరాబాద్‌ నగర యువత ఏమాత్రం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా, అధికార పార్టీలకు చెందిన తనయులు మరింతగా రెచ్చిపోతున్నారు. తమ తండ్రులు, తల్లుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా కార్పొరేటర్ కుమారుడు తన స్నేహితులతో కలిసి శ్మశానవాటికలో మద్యం సేవిస్తూ సాక్షాత్ నగర్ మేయర్‌ కంటపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించే నిమిత్తం నగర మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం సాయంత్రం అక్కడికి వెళ్లారు. అదేసమయంలో కొంతమంది యువకులు శ్మశానమే వేదికగా, అక్కడున్న సమాధులే టేబుళ్లుగా చేసుకుని మందు కొడుతుండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 
 
దీంతో, ఆగ్రహించిన ఆయన.. ఆ యువకులను అదుపులోకి తీసుకోవాలని, పోలీస్ స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మందు కొడుతున్న యువకుల్లో ఒకరు ఆ వార్డు సభ్యురాలు జయలక్ష్మి కుమారుడు కూడా ఉన్నారు.