కృత్రిమ అడవిని చూసి మురిసిన కెసిఆర్

గురువారం, 22 ఆగస్టు 2019 (08:23 IST)
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధిపేటలోని కోమటిబండలో పర్యటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లతో కలిసి ఆయన కోమటిబండలోని అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.

కోటికిపైగా మొక్కలను నాటి అక్కడ కృత్రిమ అడవిని ప్రభుత్వం సృష్టించింది. ఇప్పుడు ఆ అడవి అందరిని ఆకట్టుకుంటోంది. ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది.

సిద్ధిపేట తరహాలోనే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అలానే కృత్రిమ అడవులను సృష్టించేందుకు, తద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి.. మార్గదర్శకాల గురించి కోమటిబండలో కలెక్టర్ల సమావేశంలో కెసిఆర్ చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరయ్యారు.

అన్నీ చూడండి

Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ

Pavala Shyamala: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పావలా శ్యామల..

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments