1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Special Trains for Depavali Festival

ప్రయాణికులకు రైల్వే శుభవార్త.. దీపావళికి ప్రత్యేక రైళ్లు

Depavali Festival
దీపావళి పండుగ సీజన్‌లో ఏర్పడే రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్యరైల్వే నిర్ణయించింది. ఆ ప్రత్యేక రైళ్లనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రైన్‌ నెంబర్‌ 08585 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే నెల నవంబర్ 2వ తేదీ మంగళవారం ప్రత్యేక రైలు నడపనున్నారు. ఇక ఈ రైలు ఆ రోజు 17.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గంటలకు గమ్యం చేరుకుంటుంది.
 
రైలు నెంబర్‌ 08586 సికింద్రాబాద్ నుంచి విశాఖట్నం స్పెషల్ ట్రైన్ నవంబర్ 3న నడపనుంది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ రైలు 03వ తేదీన 21.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09.50 గంటలకు గమ్యం చేరుకోనుంది. 
 
రైలు నెంబర్‌ 08583 విశాఖపట్నం నుంచి తిరుపతికి నవంబర్ 1న ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు ఆ రోజు 19.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. 
 
రైలు నెంబర్‌ 08584 తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు నవంబర్ 2న స్పెషల్ ట్రైన్ నడపనున్నారు రైల్వే అధికారులు. ఈ స్పెషల్ ట్రైన్ 2వ తేదీన 21.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.20 గంటలకు విశాఖ చేరుతుంది.  
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అప్పు తీర్చేందుకు రూ.2 వేలు లేదని వ్యక్తి ఆత్మహత్య