1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (11:23 IST)

రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

schools closed
రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను గురువారం బంద్ చేశారు. నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల ఘటనపై ఎన్ఎస్‌యూఐ స్పందించింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను బంద్ చేయాలని నిర్ణయించింది. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం చదువుతున్న సాత్విక్ బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో ఈ మృతికి శ్రీ చైతన్య యాజమాన్యమే కారణమని ఎస్ఎస్‌యూఐ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ఇంకా సాత్విక్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాత్విక్ మృతికి నిరసనగా గురువారం శ్రీచైతన్య కళాశాలలను బంద్ చేయాలంటూ వారు పిలుపునిచ్చారు.