శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (14:33 IST)

తెలంగాణ సర్కారుకు ఆఖరి ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు

supreme court
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇదే చివరి అవకాశమంటూ మందలించింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై మొండి వైఖరితో ముందుకుసాగుతోంది. దీంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 
 
ముఖ్యంగా, ఆంధ్ర నుంచి రిలీవ్ అయిన 84 మందికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన విద్యుత్‌శాఖ అధికారులకు జైలుశిక్షే పరిష్కారమని వ్యాఖ్యానించింది. 
 
కోర్టు ఆదేశాలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని ధర్మాసనం ఆక్షేపించింది. ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు ఇదే చివరి అవకాశమని.. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.