1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. CJI UU Lalit names Justice DY Chandrachud as his successor

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్

supreme court
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయ లలిత్ తన వారసుడిని ఎంపిక చేశారు. తన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ పేరును ఆయన నామినేట్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాశారు. ఈ లేఖను ఆయన మంగళవారం అందజేయనున్నారు. 
 
అన్ని అంశాలను పరిశీలించి తదుపరి కొత్త చీఫ్ జస్టిస్‌గా చంద్రచూడ్ పేరును ఆయన సిఫార్సు చేశారు. లలిత్ తన వారసుడి కోసం ఆచారబద్ధంగా సిఫార్సు లేఖను అందజేయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తలు భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత ఆయన కేంద్రానికి ఈ లేఖను అందజేస్తారు. 
 
కాగా అన్నీ సక్రమంగా జరిగితే యుయు లలిత్ తర్వాత భారత సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 
తర్వాతి కథనం
తల్లి కళ్ళెదుటే బాలికపై సామూహిక అత్యాచారం