సంబంధిత వార్తలు
- అబార్షన్ కోసం వెళ్లే బాలిక వివరాలను పోలీసులకు చెప్పాల్సిన పనిలేదు..
- సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పూనమ్ కౌర్ ఏం చెప్పిందంటే? (video)
- అవివాహితులు, వివాహితులు అబార్షన్లు చేయించుకోవచ్చు, సుప్రీం కోర్టు తీర్పు
- తొక్కిసలాట కేసులో బాలీవుడ్ బాద్ షాకు ఊరట
- లాయర్ల ఫీజు చెల్లింపులో ఉన్న శ్రద్ధ పర్యావరణ పరిరక్షణపై లేదు : ఏపీపై సుప్రీం ఫైర్
సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయ లలిత్ తన వారసుడిని ఎంపిక చేశారు. తన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ పేరును ఆయన నామినేట్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాశారు. ఈ లేఖను ఆయన మంగళవారం అందజేయనున్నారు.
అన్ని అంశాలను పరిశీలించి తదుపరి కొత్త చీఫ్ జస్టిస్గా చంద్రచూడ్ పేరును ఆయన సిఫార్సు చేశారు. లలిత్ తన వారసుడి కోసం ఆచారబద్ధంగా సిఫార్సు లేఖను అందజేయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తలు భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత ఆయన కేంద్రానికి ఈ లేఖను అందజేస్తారు.
కాగా అన్నీ సక్రమంగా జరిగితే యుయు లలిత్ తర్వాత భారత సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరిస్తారు.
తర్వాతి కథనం
