కత్తి రీమేక్ కోసం చిరంజీవి రూ.30 కోట్ల పారితోషికం తీసుకున్నారా? నిజమేనా?

మంగళవారం, 3 మే 2016 (10:31 IST)
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తమిళంలో విజయం సాధించిన 'కత్తి' చిత్రం రీమేక్‌ని తెలుగులో ''కత్తిలాంటోడు'' టైటిల్‌తో చిరు నటించబోతున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించబోతున్నాడు. 
 
రామ్ చరణ్‌ సొంత బ్యానర్‌తో పాటు, లైకా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో చిరు చేయబోతున్న సినిమాకి భారీ పారితోషికం తీసుకోబోతున్నాడు. ''కత్తి'' సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్న చిరంజీవి 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అందుకు నిర్మాతలు కూడా సై అంటున్నారట. అడ్వాన్స్‌గా 15 కోట్లు ఆయనకి అందనున్నట్టు సినీనిపుణులు అంటున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్‌కు ఉన్న ఫాలోయింగ్, ఆయన 150 సినిమా మీద ఉన్న అంచనాలు, చాలాకాలం తరువాత చిరంజీవి నటిస్తోన్న సినిమా కావడంతో, భారీ వసూళ్లు ఉంటాయనే బలమైన నమ్మకంతో నిర్మాతలు వున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అన్నీ చూడండి

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

అన్నీ చూడండి

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments