టాలీవుడ్లో నెం.1 స్థానానికి మహేష్ బాబు-పవన్ కల్యాణ్ పోటాపోటీ..!!
ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే అందరికి గుర్తొచ్చేపేరు మహేష్. గతంలో నెంబర్ వర్ పొజిషన్ కోసం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పోటీపడుతూ ఉండేవారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోనూ బిజిగా ఉంటూ యేడాదికి ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకుంటున్నాడు, కానీ మహేష్ బాబు మాత్రం వరుస మూవీలను చేస్తూ, కొత్త కొత్త రికార్డ్లను సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇదిలా ఉంటే భారీ అంచనాలతో విడుదలైన ''బ్రహ్మోత్సవం'' బాక్సాఫీసులో బోల్తా కొట్టింది. దీంతో మహేష్ తన తదుపరి చిత్రంపై ఎక్కువ ఆశలే పెట్టుకున్నాడు. తమిళ దర్శకుడు మురుగదాస్, మహేశ్ కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరవిషయం వెలువడింది. కాగా మహేష్ బాబు ఈ మూవీకి తీసుకుంటున్న పారితోషికం గురించి తెలిస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే. ఈ చిత్రానికి హీరోగారు దాదాపు 23 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ని తీసుకున్నట్టుగా టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ని స్థాపించి, తన మూవీలలో భాగస్వామ్య నిర్మాతగా కూడా మారుతున్నాడు. అందుకే మహేష్ బాబు శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం వంటి మూవీల్లోనూ పెట్టుబడులు పెట్టాడు.
శ్రీమంతుడు మూవీకి మహేష్ బాబు 40 కోట్ల రూపాయల వరకూ లాభాలను పొందినట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషలలో రూపొందనున్న మురుగుదాస్ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా నటిస్తుండగా విలన్గా ప్రముఖ దర్శకులు ఎస్ జే సూర్య నటించనున్నాడు. వంద కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్గా కనిపించనున్నాడు.
మహేష్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్, మురుగదాస్కు బాలీవుడ్లో ఉన్నమార్కెట్ కారణం చేత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా డబ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.