కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)
ఈమధ్య కాలంలో సహనం అనేది చాలామటుకు చచ్చిపోతున్నట్లు కనబడుతోంది. చిన్నచిన్న విషయాలకే కొట్లాటలకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి కదులుతున్న రైలులో జరిగింది. ఏ విషయం దగ్గర తేడా వచ్చిందో తెలియదు కానీ మహిళా బోగీలో ప్రయాణిస్తున్న యువతుల మధ్య కోట్లాట జరిగింది.
ఈ కొట్లాటలో మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. ఈ దాడిలో పలువురికి రక్తం కూడా కారుతోంది. మరీ ప్రమాదకరంగా వారు రైలు డోర్ వద్ద తన్నుకోవడంతో ఓ మహిళ క్రింద పడిపోయేదే. దాన్ని చూసి మిగిలినవారు కేకలు పెట్టడంతో ఇవతలకి జరిగారు. ఈ గొడవ రైలు డోంబివ్లి నుంచి కల్యాణ్ స్టేషన్ల మధ్య జరిగినట్లు చెబుతున్నారు.
ఐతే దీనికి సంబంధించి తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగినట్లు మిడ్ డేలో పోస్ట్ పెట్టడంతో అది ఎప్పుడు జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.