1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (10:44 IST)

పూరీ జగన్నాథ్ వరుస ప్లాప్‌లతో టెన్షన్ పడిన హీరోయిన్!

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరిగా పూరీ జగన్నాథ్ గుర్తింపు పొందారు. అయితే, ఇటీవలికాలంలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా "పైసా వసూల్" చిత్ర

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరిగా పూరీ జగన్నాథ్ గుర్తింపు పొందారు. అయితే, ఇటీవలికాలంలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా "పైసా వసూల్" చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రియను ఎంపిక చేసుకోవాలని దర్శకుడుతో పాటు హీరో కూడా నిర్ణయించారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. శ్రియ.
 
అయితే, ఈ విషయాన్ని శ్రియకు చెప్పగానే ఆమెలో ఎక్కడలేని టెన్షన్ మొదలైందట. దీనికి ఓ కారణం లేకపోలేదు. గతంలో తమ కాంబినేషన్‌లో 'చెన్నకేశవ రెడ్డి' .. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలు చేశామనీ, అవి ఘన విజయాలను సాధించాయని అన్నారు. 
 
అయితే.. పూరీ వరుస ప్లాప్‌లు పూరీ జగన్నాథ్ ఇస్తుండటంతో ఆమె తెగ టెన్షన్ పడిందట. 'పైసా వసూల్' చిత్రంలో నటిస్తే బాలయ్యతో హాట్రిక్ హిట్ దక్కుతుందో.. లేదోననే టెన్షన్‌కి శ్రియ లోనైందని చెప్పారు. దీంతో హిట్ ఖాయమంటూ బాలయ్య భరోసా ఇవ్వడంతో ఆమె సమ్మతించింనట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.