శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (10:47 IST)

'జిల్' దర్శకుడు రాధాకృష్ణతో 'బాహుబలి' నెక్స్ట్ మూవీ

'బాహుబలి'తో జాతీయ స్టార్ అయిన ప్రభాస్ ఇపుడు... 'సాహో' సినిమాపైనే దృష్టి పెట్టారు. పక్కా ప్లానింగ్‌‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బహుభాషా చిత్రం కావడంతో, ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్‌ను తీసుకు

'బాహుబలి'తో జాతీయ స్టార్ అయిన ప్రభాస్ ఇపుడు... 'సాహో' సినిమాపైనే దృష్టి పెట్టారు. పక్కా ప్లానింగ్‌‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బహుభాషా చిత్రం కావడంతో, ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్‌ను తీసుకున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. 
 
'జిల్' దర్శకుడు రాధాకృష్ణకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. 
 
ఒక వైపున 'సాహో' సినిమా చేస్తూనే.. ఆ తర్వాత సినిమా షూటింగులోనూ ప్రభాస్ పాల్గొననున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలోగా నటీనటులు.. సాంకేతిక నిపుణుల ఎంపికతో పాటు అన్ని పనులను పూర్తి చేసుకుని రాధాకృష్ణ రెడీగా వుంటారు. 'సాహో'తో పాటు ఈ సినిమాను కూడా ప్రభాస్ పూర్తి చేయనున్నాడు.