నాగ చైతన్యతో జతకట్టనున్న రకుల్ ప్రీత్...
టాలీవుడ్ హీరో నాగార్జున కుమారుడు నాగ చైతన్య, హీరోయిన సమంతల వివాహంపై రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో చైతు ప్రేక్షకుల
టాలీవుడ్ హీరో నాగార్జున కుమారుడు నాగ చైతన్య, హీరోయిన సమంతల వివాహంపై రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో చైతు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగార్జునను 'సోగ్గాడు'గా చూపించి బంపర్ హిట్టు కొట్టిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
తన తొలి సినిమాతోనే మంచిపేరు తెచ్చుకున్న కల్యాణ్ కృష్ణ ఇప్పుడు నాగ చైతన్యను సరికొత్త కోణంలో చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో మొదట హీరోయిన్గా సమంతను అనుకున్నారు. అయితే తాజాగా సమంత స్థానంలో రకుల్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సమ్మూ-చైతూ రిలేషన్పై రోజుకో వార్త వస్తుండడంతోనే హీరోయిన్ను మార్చినట్లు ఫిలింనగర్ టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కోసం రకుల్ డేట్స్ కూడా కేటాయించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును ఈ నెలలోనే ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే, రకుల్ ప్రస్తుతం తమిళంలో విశాల్ సరసన 'తుప్పారివాలన్' చిత్రంలో కూడా కథానాయికగా నటిస్తోంది.