శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (08:32 IST)

ఉచితంగా "ఆదిపురుష్" సినిమా టిక్కెట్ల పంపిణీ.. నిజమా?

Aadipurush poster
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్‌లు జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తిరుపతి వేదికగా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం టిక్కెట్లను పది వేల మందికి ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత అభిషేక్ అగర్వాల్ వెల్లడించారు. 
 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి ఈ టిక్కెట్లను ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 
 
ఈ టిక్కెట్లను కావాలనుకునేవారు సెలెబ్రేటింగ్ 'ఆదిపురుష్' గూగుల్ ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందని, వివరాలు నమోదు చేసిన వారికి టిక్కెట్లు పంపిస్తామన్నారు. మరన్ని వివరాల కోసం 95050 34567 అనే మొబైల్ నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.