శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (17:47 IST)

బాలీవుడ్ బ్యూటీ అలియాకు అరుదైన గౌరవం

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. గతేడాదికిగాను మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా ఆలియా భట్ ఎంపికయ్యారు. టైమ్స్ సంస్థ 2018 సంవత్సరానికిగానూ 50 మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఈ సంస్థ వివిధ రంగాల్లో పనిచేసే మహిళలపై ఇటీవల ఒక ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. 
 
ఈ పోల్‌లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ విభాగంలో ఎక్కువ శాతం ఓట్లు అలియా భట్‌కు పడ్డాయి, దీనితో ఆలియా మొదటి స్థానాన్ని సాధించుకుంది. ఆ తరువాతి స్థానాల్లో మీనాక్షి చౌదరి, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, గాయత్రి భరద్వాజ్, అదితీ రావు, జాక్వలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ, అనుక్రుతి తదితరులు ఉన్నారు. కాగా ప్రస్తుతం అలియా తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాటు హిందీలో ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’లో నటిస్తోన్న విషయం తెలిసిందే.