గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 ఆగస్టు 2020 (13:31 IST)

నిధి అగర్వాల్ వెంటపడుతున్న నెటిజన్లు...

టాలీవుడ్ కుర్రహీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. 2018లో నాగ చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన 'స‌వ్యసాచి' చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. చూడ‌చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఆమె సొంతం. నార్త్‌లో 'మున్నా మైఖేల్' చిత్రంతో బాగా ఫేమ‌స్ అయిన ఈ భామ గ‌త ఏడాది తెలుగులో వ‌చ్చిన‌ 'ఇస్మార్ట్ శంక‌ర్' చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది. ఈ చిత్రంతో నిధికి భారీ ఆద‌ర‌ణ పెరిగింది. 
 
సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్న నిధి అగ‌ర్వాల్‌కు ఫేస్‌బుక్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య 8.5 మిలియన్లను దాటింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 5.4 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక‌ ట్విట్టర్ పేజీలో అర మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 
 
అంటే మొత్తం 14.5 మిలియన్ల మంది ఫాలోవర్లను ఈ అమ్మ‌డు కలిగివుంది. ప్ర‌స్తుతం జ‌యం ర‌వి హీరోగా తెర‌కెక్కుతున్న భూమి, పునీత్ రాజ్ కుమార్ జేమ్ అనే క‌న్న‌డ చిత్రం చేస్తుంది. తెలుగులోను ఓ చిత్రం చేస్తుంది.