1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (16:31 IST)

చేపల పులుసంటే మహాయిష్టమంటున్న హీరోయిన్!

తనకు చేపల పులుసంటే మహాయిష్టమని టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని చెబుతోంది. అలాగే టాలీవుడ్‌లో కేవలం హీరోయిన్‌గా మాత్రమేకాకుండా 'లౌక్యం' చిత్రం తరహాలో ఉన్న కామెడీ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. 
 
మోడల్‌గా రాణిస్తూ వచ్చిన హంసా నందిని ఆ తర్వాత 'ఒక్కటవుదాం' అనే చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన ఆమె... ఇప్పటివరకు 29 చిత్రాల్లో నటించింది. తన అసలు పేరు పూనం అని చెప్పుకొచ్చింది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన 'రుద్రమదేవి' సినిమాలో మధునిక పాత్ర తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువచేసిందని చెప్పింది. 
 
పలు సినిమాలో హీరోయిన్‌గా, ప్రత్యేక గీతాలకు డ్యాన్సర్‌ను నటించిన తనకు గోపీచంద్‌ హీరోగా నటించిన 'లౌక్యం' సినిమాలో బ్రహ్మానందానికి భార్యగా చేసిన పాత్ర బాగా నచ్చింది. కామెడీ పండించే పాత్ర అది. అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా. అలాగే 'మిర్చి', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో మంచిపేరు వచ్చిందని చెప్పింది.