శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (17:55 IST)

శివ.. శివ... శివరాత్రి జాగారంలో డ్యాన్స్ చేసిన హీరోయిన్లు

మహాశివరాత్రి జాగారం కోసం శివభక్తులు తమకు తోచిన విధంగా జాగారం చేస్తుంటారు. కొందరు సినిమాలకు వెళితే, మరికొందరు ఇంట్లోనే శివభక్తి సినిమాలు చూస్తూ ఉండిపోతారు. ఇంకొందరు శివాలయాలకెళ్లి జాగారం చేస్తుంటారు. మరికొన్ని గ్రామాల్లో అయితే, రికార్డు డ్యాన్సుల పేరుతో జాగారం చేస్తారు. 
 
అయితే, కోయంబత్తూరు జిల్లాలోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు, జాగారం జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు కూడా హాజరయ్యారు. ఇంతవరకు బాగానేవుంది. 
 
అయితే, ఈ వేడుకలకు అనేక మంది హీరోయిన్లు కూడా తరలి వచ్చారు. వారిలో తమన్నా, కాజల్ అగర్వాల్, అదితిరావు హైదరీ, దగ్గుబాటి రానా వంటి వారు కూడా ఉన్నారు. ఆ తర్వాత శివ‌రాత్రికి సంబంధించి ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. 
 
ఈ ప్రసంగం పూర్తయిన తర్వాత వినోద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో కాజ‌ల్‌, త‌మ‌న్నా, కాజ‌ల్ సోద‌రి నిషా అగ‌ర్వాల్‌లు వాసుదేవ్‌తో క‌లిసి నృత్యం చేశారు. వీరంతా కలిసి స్వర్గీయ ఎంజీఆర్ నటించిన చిత్రంలోని ఒరే వానిలే.. ఒరే మన్నిలే అనే పాపులర్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ప్ర‌స్తుతం డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.