బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (09:42 IST)

హోటల్ బిల్లు చూసి పత్తాలేకుండా పారిపోయిన హీరోయిన్

'దండుపాళ్యం' ఫేం పూజా గాంధీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఎప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లో ఉండే పూజా తాజాగా ఓ ల‌గ్జ‌రీ హోట‌ల్‌కి బిల్లుక‌ట్ట‌కుండా ప‌రార‌య్యింద‌ట‌. దీంతో హోట‌ల్ యాజ‌మాన్యం పోలీసుల‌ని ఆశ్ర‌యించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొద్ది రోజుల క్రితం బెంగ‌ళూరులోని ల‌గ్జ‌రీ హోట‌ల్‌లో గ‌దిని పూజా గాంధీ అద్దెకి తీసుకున్నారు. హోట‌ల్ బిల్లు సుమారు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకుంది. దీంతో ఆమె వద్ద అంత డబ్బు లేకపోవడంతో పత్తాలేకుండా పారిపోయింది. 
 
ఈ విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా గ్ర‌హించిన హోట‌ల్ యాజ‌మాన్యం పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు న‌మోదు చేసి స‌మ‌న్లు జారీ చేశారు. ఈ సమన్లు అందుకున్న పూజాగాంధీ పోలీసుల ముందుకు వచ్చారు. తాను హోట‌ల్‌కి రూ. 2 లక్ష‌లు చెల్లించిన‌ట్టు వెల్ల‌డించింది. మిగ‌తా మొత్తం చెల్లించ‌డానికి కాస్త స‌మ‌యం కావాల‌ని కోరింది. దీనికి హోట‌ల్ యాజ‌మాన్యం ఓకే చెప్ప‌డంతో వివాదం స‌మ‌సింది.